టాలీవుడ్ లో ఇంకో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతోంది. విచిత్రంగా ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా దగ్గుబాటి తో “రాక్షసరాజా” ప్రకటించిన తేజ ఈ క్రేజీ ప్రాజెక్టులోకి మరో సీనియర్ హీరోను తీసుకు వస్తున్నాడు. సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు తేజ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు “అభిరామ్ దగ్గుపాటి”ని పరిచయం చేస్తూ చేసిన “అహింస” సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫల్టీలు కొట్టింది.
ఇప్పుడు తేజ సురేష్ బాబు పెద్ద కొడుకు రానా దగ్గుబాటితో “రాక్షస రాజా” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఈ సినిమాలో కథానాయకుడు రానా దగ్గుపాటి మెయిన్ హీరోగా… సీనియర్ నటుడు రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ పాత్ర కోసం తేజ రాజశేఖర్ని అడిగారని.. ఆయన కూడా ఇప్పటికే ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ మళ్లీ సినిమాల్లో కనిపించనున్నాడు. మరో ట్విస్ట్ ఏంటంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.
ఏదేమైనా ఈ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ కేక పెట్టిస్తోంది. రానాతో ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన తేజ ఇప్పుడు ఈ మల్టీస్టారర్ సినిమా కూడా హిట్ చేస్తే తిరుగే ఉండదు.