వెండితెరపై మనకు ఇష్టమైన హీరో ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఎంతో ఆనందంతో ఈలలు కేకలు వేస్తారు.. ఇక మరి ఆ హీరోలు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక ఆ హీరోల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.. ఇలా రెండు లేదా మూడు కంటే ఎక్కువ పాత్రలు ఓకే హీరో చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు.. ఇక దానికి ఎంతో కృషి పట్టుదల ఉండాలి.. ఇలా ట్రిపుల్ రోల్ చేయడం మన తెలుగు హీరోలకు కొత్త ఏమీ కాదు.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి సుధీర్ బాబు వరకు ట్రిపుల్ రోల్ చేసిన పెంచిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.
మన తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా త్రిపుల్ రోల్ చేసిన ఏకైక హీరోగా రికార్డులు సృష్టించాడు సీనియర్ ఎన్టీఆర్. 1972 లో కులగౌరవం సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. అయితే అది జస్ట్ హిట్ అని మాత్రమే అనిపించుకుంది . కానీ 1977 లో దానవీర శూర కర్ణ సినిమాలో కర్ణుడు ,దుర్యోధనుడు, శ్రీ కృష్ణుడి పాత్రల్లో కనిపిస్తూ మరోవైపు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. సినిమాలో ఆయన నటన ,డైలాగులు పీక్స్ లో ఉంటాయి . దానితో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలు మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా టి రామారావు దర్శకత్వంలో వచ్చిన “నవరాత్రి” సినిమాలో ఏకంగా 9 క్యారెక్టర్లు చేయటం మరో విశేషం.. ఈ సినిమా తర్వాతే ఏఎన్ఆర్ ద్విపాత్ర అభినయం చేసిన సినిమా లేదు.
1978 లో మొదటిసారి కుమార రాజా సినిమాలో ట్రిపుల్ రోల్ పోషించిన కృష్ణ ,ఆ తరువాత 1982 లో పగబట్టిన సింహం , డాక్టర్ -సినీ యాక్టర్ సినిమాల్లో మూడు పాత్రల్లో కనిపించారు . 1983 లో సిరిపురం మొనగాడు ,1984 లో రక్త సంబంధం ,బంగారు కాపురం ,1997 లో బొబ్బిలి దొర సినిమాల్లో ట్రిపుల్ రోల్ పోషించారు ఆయన . అయితే వీటిలో కుమార్ రాజా, పగబట్టిన సింహం ,మాత్రమే హిట్ అవగా మిగిలినవి యావరేజ్, ప్లాప్ లుగా మిగిలాయి.
1983 లో శోభన్ బాబు “ముగ్గురు మొనగాళ్లు” సినిమాలో ట్రిపుల్ రోల్ వేశారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాకిది తెలుగు రీమేక్. కానీ ఆ సినిమా ఆడలేదు . 1994 లో చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు రిలీజ్ అయింది . ఇందులో ఆయన మూడు పాత్రలు పోషించారు . ఇది ఆయన సొంత సినిమా . అయినప్పటికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
నటసింహ నందమూరి బాలకృష్ణ 2012లో వచ్చిన ‘అధినాయకుడు’లో బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపిస్తారు . సినిమాలో డైలాగ్స్ పొలిటికల్ గా సెన్సేషన్ అయినా సినిమా మాత్రం ప్లాప్ అయింది . 2017 లో జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనపడ్డారు . ఈ సినిమా హిట్ అయింది . పైగా జై పాత్రలో ఎన్టీఆర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి .
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు.. ‘అమిగోస్’ మూవీలో సరికొత్త గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించాడు. ట్రిపుల్ రోల్స్ చేసిన అమిగోస్ మూవీ అనుకున్నంత హిట్ కాలేకపోయింది. సుధీర్ బాబు క్రొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమా లో 3 గెటప్పుల్లో సుధీర్ బాబు కనిపించనున్నారు. మామా మశ్చీంద్ర టీజర్ లో మూడు పాత్రల్లో కనిపించి అందరిని సుధీర్ బాబు సర్ప్రైజ్ చేసాడు . కామెడీ ,రొమాన్స్ .యాక్షన్ లతో సినిమాను దట్టించినట్టు టీజర్ లో తెలుస్తుంది.