మెగా బ్రదర్ నాగబాబుకి చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి పేరు ఉంది. అంతేకాకుండా తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని తెగువ ఈ మెగా బ్రదర్ సొంతం. అందుకే టాలీవుడ్ లో ఈయన పెద్ద స్టార్ అవ్వ లేకపోయినా మెగా అభిమానులు నాగబాబును గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తన సినిమాలతో మెగా అభిమానులు మెప్పించాడు.
ఇక రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోని నాగబాబు రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒకసారి నాకు తీవ్రమైన అస్వస్థత రావటంతో చిన్నచిన్న చెడు అలవాట్లు కూడా నాకు వచ్చాయి. చిన్నతనం నుంచి నాకు జంతువులను హింసించి చంపి తినటం అనేది ఇష్టం ఉండేది కాదు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా నాన్ వెజ్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది.
ఆపేయాలని ఎప్పటినుంచో మైండ్లో అనుకుంటూ ఉన్నాను కానీ అది కుదరటం లేదు. రీసెంట్ గా అనారోగ్యానికి గురవటం దాంతో ఈ అలవాట్లను మానేయాలని అనుకోవడం దాంతోపాటుగా మంచి సమయం అనుకొని నాన్ వెజ్ కూడా మానేశానంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఇక అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసి కూర్చుని మందు కొట్టారా అని అడగగా, నాగబాబు ‘ఛీ ఛీ అలాంటిది ఏమీ లేదు ఎప్పుడూ కలిసి మందు కొట్టలేదు కానీ, కలిసి భోజనాలు మాత్రం ఇప్పటికీ చేస్తూనే ఉంటాము.
అన్నయ్య ఎక్కువగా మద్యం తాగడు ఎప్పుడో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు మాత్రమే లైట్ గా తీసుకుంటాడు. కళ్యాణ్ బాబు కూడా అంతే అన్నయ్యనే ఫాలో అవుతాడంటూ అని నాగబాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.