చిత్ర పరిశ్రమలో ఉండే కొందరు హీరోయిన్లు కొన్ని సినిమాలకే పరిమితం అవుతారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు లేదా ఇతర కారణాలతో చిత్ర పరిశ్రమకు దూరమైపోతారు. టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆర్తి చాబ్రియా. ఈ పేరు చెప్తే ఎవరికీ అంతగా గుర్తుకు రాదు కానీ.. శ్రీరామ్ హీరోగా వచ్చిన ఒకరికి ఒకరు సినిమాలో హీరోయిన్ సుబ్బలక్ష్మి అంటే అందరూ ఊరికనే గుర్తుపట్టేస్తారు.
2003లో వచ్చిన ఒకరికి ఒకరు సినిమా అప్పట్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కెమేరామెన్ రసూల్ ఎల్లోర్ దర్శకత్వం వహించారు. ప్రధానంగా ఈ సినిమా ‘ఎక్కడున్నావమ్మా’, ‘నువ్వే నా శ్వాస’పాటలు ఇప్పటికీ చాలామందికి ఆల్ టైం ఫేవరెట్ సాంగ్స్ గా ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆర్తి చాబ్రియాకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. ముంబై కు చెందిన ఈ ముద్దుగుమ్మ ముందుగా మోడల్ గా తన కెరీర్లు మొదలుపెట్టి.. ఆ తర్వాత మధుర క్షణం అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. పలు బాలీవుడ్ సినిమాలు చేసినా తెలుగులో వచ్చిన ఒకరికి ఒకరు సినిమాతోనే ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయల రవి సినిమాలో ఐటమ్ సాంగ్లో కూడా మెరిసింది.
ఆర్తీ చివరగా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన గోపి గోడమీద పెళ్లి సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. 2013 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమైన ఆర్తి 2019లో చార్టెడ్ అకౌంట్ విశ్వనాథ్ స్వామిని పెళ్లి చేసుకుంది. ఈమె హీరోయిన్ గానే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా ప్రస్తుతం విక్టోరియస్ మైండ్ పవర్ అనే ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ ఫామ్ కు ఫౌండర్గా ఉంది.
సినిమాలకు దూరంగా ఉన్న ఆర్తి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఇక తాజా ఫోటోలను, వీడియోలను ఎప్పుడు సోషల్ మీడియలో షేర్ చేస్తు ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ‘ఆర్తి అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.