మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ధ్రువ కూడా ఒకటి. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ నటన యాక్షన్ సీన్స్ సినిమాకే ఎంతో హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాని కోలీవుడ్ లో వచ్చిన తని ఒరువన్ సినిమాకు రీమేక్ గా సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. అదే సమయంలో ఈ సినిమాలో రామ్ చరణ్ సిక్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి నటించిన విషయం అందరికీ తెలిసిందే. అరవింద్ స్వామి కోలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇదే సమయంలో ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా అరవింద్ స్వామిని కాకుండా మరో స్టార్ హీరోని అనుకున్నారట. అయితే ఈ ధ్రువ సినిమాను వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున. దర్శకుడు సురేందర్ రెడ్డి ముందుగా ఈ విలన్ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆయన కూడా కథ మొత్తం విన్న తర్వాత సినిమాకు కూడా ఓకే చెప్పారట కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మళ్లీ నో చెప్పారని తెలుస్తుంది. అంతేకాకుండా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని కూడా అనుకున్నారట కానీ హీరోగా రాణిస్తున్న సమయంలో నెగటివ్ పాత్రలో నటిస్తే బాగోదని రామ్ చరణ్ నో చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో వారందరూ నో చెప్పటంతో కోలీవుడ్లో నటించిన అరవింద స్వామినే తెలుగులో కూడా తీసుకున్నారట. ఇలా నాగార్జున తన కెరీర్లు ఓ మంచి క్యారెక్టర్ ను వదులుకోవాల్సి వచ్చింది.