ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారింది. స్టార్ హీరోలకు సమానంగా హీరోయిన్లు కూడా భారీగానే తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఒక్కొక్క సినిమాకి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు కూడా పుచ్చుకుంటున్నారు అంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్లుగా రాజ్యమేలుతున్న ముద్దుగుమ్మలు ఎవరయ్యా అంటే అందరూ టక్కున చెప్పే పేరులు నయనతార, సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే.
ప్రస్తుతం ఇవే పేర్లు ఎక్కడ చూసినా ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అయితే వీళ్ళలో ఏ ముద్దుగుమ్మ అందరికంటే ఎక్కువ పారితోషం తీసుకొని టాప్ ప్లేస్లో ఆస్తులను కూడబెట్టిందన్నది ఇంట్రస్టింగ్ న్యూస్. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ల ఆస్తుల జాబితాలో నయనతార మొదటి స్థానంలో నిలిచింది. ఈమె ఆస్తుల విలువ రూ.500 + కోట్లుగా ఉంటాయని తెలుస్తుంది.
అంతేకాకుండా నయనతార తాను చేసి ఒక్కో సినిమాకి పది కోట్ల వరకు పారితోషకం అందుకుంటుందట. ఈమె తర్వాత స్థానంలో స్టార్ హీరోయిన్ తమన్నా..ఆస్తులు విలువ కూడా సుమారు రూ.160 కోట్ల పైనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్థానంలో గ్లోబల్ హీరోయిన్ సమంత ఆస్తులు విలువ కూడా రూ.150 కోట్లకు పైమాటే అన్నట్టు తెలుస్తుంది. నాగచైతన్యతతో విడాకులు తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన సమంత ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం సమంత కూడా నయనతారలా సినిమాకి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేస్తోంది. కాగా వీరి తర్వాత స్థానంలో రష్మిక మందన్న రూ.100 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కీర్తి సురేష్, పూజ హెగ్డే, అనుష్క శెట్టి లాంటి హీరోయిన్లు చివరి స్థానంలో నిలిచారు. ఇదే సమయంలో పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నెంబర్ వన్ స్థానంలో నయనతార నిలిచింది.