చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలు ఎన్నో మంచి సినిమాలు చేసి కొన్ని అనుకోని కారణాలవల్ల చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. అలా వారు దూరమైనప్పటికీ వారు చేసిన సినిమాలు మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు 20కు పైగా సినిమాల్లో నటించిన వేణు ప్రేక్షకులను ఎంతో మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణు తొలి సినిమాతోనే తన నటనతో నంది అవార్డును అందుకున్నాడు.
అలా వేణు టాలీవుడ్ లో తనకి నచ్చిన సినిమాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా వేణు నటించిన సినిమాలలో పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషీగా, చిరునవ్వుతో, స్వయంవరం వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత వేణు కొద్ది కొద్దిగా సినిమాలకు దూరమవుతూ వచ్చారు. ఇక మళ్ళీ 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.
ఇక మళ్లీ ఆ తర్వాత పది సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. మళ్లీ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు వేణు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. వేణు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. వేణు సినిమాలు చేస్తున్న సమయంలోనే అనుపమ చౌదరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వేణు భార్య అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో ఆమె మంచి ఎక్స్ఫర్ట్.
ఇక ఆదే సమయంలో వీరికి పెళ్లయినప్పటికీ అనుపమ మద్రాసులోనే బిజినెస్ రంగంలో కొనసాగుతూ దూసుకెళ్తోంది. దళసరి పేపర్లతో చేసే ఆర్ట్లో ఆమె నిపుణురాలు.. ఈ వ్యాపారంలో ఆరితేరిన ఈమె ఈ రంగంలో రాణిస్తూనే, పెయింటింగ్ లో కూడా నిపుణుత సాధించి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటుంది. వీరికి కూతురితో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఆమె భర్త మరియు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడిపేస్తోంది. ఇక వేణు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్కు స్వయానా మేనళ్లుడు కాగా.. వేణు బావ ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.