పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది రేణు దేశాయ్. ఆ సినిమా షూటింగ్ టైంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి.. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత 2008లో పవన్ని పెళ్లి చేసుకుంది. బద్రి తర్వాత పవన్ – రేణు కాంబోలో జానీ సినిమా కూడా పవన్ స్వీయ దర్శకత్వంలో వచ్చింది.
వీరికి ఆఖీరా నందన్, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత మనస్పర్దలతో విడిపోవాల్సి వచ్చింది. ఇక తర్వాత పిల్లలతో కలిసి పూణేకి వెళ్లిన రేణు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం రేణు దేశాయ్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ తల్లిదండ్రులు ఆడవారి కంటే మగవారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారట.
ఆడవారిని వంటింటి కుందేళ్ళలా ట్రీట్ చేసే వారట.. రేణు దేశాయి ఒకసారి ఇంట్లో వారికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద హీరోయిన్ అవ్వడం తన కల అని చెప్పిందట. కానీ రేణు కుటుంబం ఒప్పుకోలేదట. దీంతో ఆమె ఓ రోజు రాత్రి ఇంట్లో వారందరూ నిద్రపోయాక ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట. అప్పటినుంచి వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో రహస్యంగా ఉంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది రేణు.
బాలీవుడ్లో మోడల్గానే ఉంటూ బద్రి సినిమాతో అవకాశాన్ని దక్కించుకొని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతకు ముందే ఆమె తమిళ్లో ప్రభుదేవా సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. రవితేజ నటిస్తున్న ‘ టైగర్ నాగేశ్వర రావు ‘ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోన్న రేణు తన సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా సక్సెస్ అవుతుందో ? చూడాలి.