రామ్ చరణ్- పునీత్ రాజ్ కుమార్ కాంబోలో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..!

సాధారణంగా మన చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించని క్రేజీ మల్టీస్టార్ సినిమాల ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సీనియర్ హీరోలు అలాగే స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు. అయితే ఎప్పుడు ఆ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో ఒక జనరేషన్ కి చెందిన ఇద్దరు హీరోలు కలిసి ఇప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం పక్కన పడితే రెండు ఇండస్ట్రీలు కి చెందిన ఒకే తరం స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Puneeth Rajkumar (@PuneethRajkumar) / Twitter

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఊపు వచ్చింది. ఇదే సమయంలో ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ కంటే ఎవరు ఊహించని ఎన్నో క్రేజీ మల్టీ స్టార్ సినిమాలు మిస్ అయ్యాయి. అలా మిస్సయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ కలిసి మల్టీస్టారర్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ ధ్రువ.

Dhruva Movie Wallpapers, Posters & Stills

ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో అరవింద్ గోస్వామి క్యారెక్టర్ కోసం ముందుగా పునీత్ రాజ్ కుమార్ ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనుకున్నారట. హీరో రామ్ చరణ్ కూడా చెప్పకుండా నేరుగా పునీత్ రాజ్ కుమార్ ని కూడా సురేందర్ రెడ్డి అప్రోచ్ అయ్యారట.. అదేవిధంగా రామ్ చరణ్, పునీత్ రాజ్ కుమార్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సాన్నిహిత్యంతోనే రామ్ చరణ్ తో సినిమా అనగానే పునీత్ రాజ్ కుమార్ ఓకే చేశాడట.

Direction Announcement Coming Soon from Stylish Villain Arvind Swamy

అయితే ఈ విషయం రామ్ చరణ్ కు తెలియడంతో పునీత్ రాజ్ కుమార్ ని విలన్ గా ఒప్పుకోలేదట.. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ని నెగటివ్ రోల్ లో చూపిస్తే ఆయన అభిమానులు తట్టుకోలేరని సురేందర్ రెడ్డి కి స్వయంగా చెప్పి ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ కూడా ఫోన్ చేసి మరి చెప్పాడట రామ్ చరణ్. ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన ధ్రువ సినిమా అరవింద స్వామి చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం పునీత్ రాజకుమార్ జీవించి ఉంటే చరణ్‌తో కలిసి భవిష్యత్తులో ఓ సినిమా వచ్చే అవకాశం ఉండేది..!!