టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ నటించిన బ్రో సినిమా ఈ నెల 28న థియేటర్లలోకి వస్తోంది. ఇదే సమయంలో పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ల విషయం ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంది.
ప్రత్యర్థి పార్టీల నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తన రెండో భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అన్నా లేజీనావోను పెళ్లి చేసుకున్నాడు ఈమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికి మత్రమే తెలుసు. పవన్ ముందుగా 1997లో విశాఖకు చెందిన నందినిని వివాహం చేసుకున్నాడు.
ఇక వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడం.. చివరకు అవి విడాకులకు దారి తీసింది. ఈ విషయంపై నందిని అప్పట్లో పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టరట. దీంతో 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ భరణం కింద నందినికి కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను భరణంగా ఇచ్చారట.
విడాకుల తర్వాత నందిని.. జాహ్నవిగా పేరు మార్చుకొని 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రూ. 500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఈమె తన భర్త కృష్ణారెడ్డితో అమెరికాలో తన పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తుంది.