టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు క్రేజ్ను మించి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ దూల్ఫేట్ ఈశ్వర్ గా తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ తెరకెక్కించెగా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశోక్ రాజు ఈ సినిమాలో విలన్ గా నటించాడు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా అలనాటి మేటి నటి మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలైన తొలి షోకే పాజిటివ్ టాక్ వచ్చింది, ఇక ప్రభాస్ నటన కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా రెండు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో నాలుగు కోట్లకి పైగా కలక్షన్లు రాబట్టింది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్కు యూత్లో భారీ క్రేజ్ కూడా పెరిగింది. అదే సమయంలో ప్రభాస్ తన తొలి సినిమా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేయాల్సి ఉంది. అయితే అప్పటికే ఆ స్టోరీ ఎన్టీఆర్కు లాక్ అయిపోయిందని చెప్పడంతో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.