ముగ్గురు స్టార్ హీరోలు న‌చ్చ‌లేద‌ని సుడిగాలి సుధీర్‌కు ఓకే చెప్పిన హీరోయిన్‌…!

జబర్దస్త్ షోస్‌ తో కమెడియన్ గా రాణిస్తున్న సుడిగాలి సుధీర్ చిన్న సినిమాలు చేస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. చాలా కాలం నుంచి సుడిగాలి సుదీర్ – రష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. త్వరలో పెళ్లికూడా చేసుకుంటారని చాలా వార్తలు వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఏమీ లేదని.. జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే తాము క‌లిసి వ‌ర్క్ చేస్తుంటామ‌ని ఇద్దరు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలో తెలియజేస్తూనే ఉంటున్నారు.

రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు షోలో చూపించారు. అయితే అది ఎంతవరకు నిజమో సుధీర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒక హీరో మంచి విజయం సాధిస్తే చాలు అతడికి వెంటనే క్రేజీ ఆఫర్లు వచ్చి పడతాయి. అలాగే సుడిగాలి సుధీర్ కూడా ఫాలోయింగ్ పెరగడంతో గాలోడు మూవీలో న‌టించాడు.

ఈ గాలోడు సినిమా తరువాత సుధీర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. స‌రైన స్టోరీ దొరకలేదని.. టీవీ షోల‌తో బిజీగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు త్వ‌ర‌లోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా లాంఛ్‌ చేయడం ఒక ఎత్తు అయితే… ఇందులో హీరోయిన్ గా తమిళ బ్యూటీ దివ్యభారతి నటించడం మరో ఎత్తు.

విచిత్రం ఏంటంటే ఇదే దివ్య‌భార‌తిని ఇంత‌కు ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిఖిల్‌, రామ్ సినిమాల్లో న‌టించ‌మ‌ని అడిగితే వాళ్ల‌కు నో చెప్పి.. ఇప్పుడు సుధీర్ ప‌క్క‌న న‌టించేందుకు ఓకే చెప్పింది. దివ్య‌భార‌తి సుధీర్ ప‌క్క‌న న‌టించేందుకు ఓకే చెప్ప‌డంతో సుధీర్ నక్కతోక తొక్కాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల‌ ముందుకి రానుంది.