డెడ్ చీఫ్ రేటుకే వ‌చ్చేస్తోన్న శంక‌ర్ కూతురు అదితి… !

సౌత్ ఇండియ‌న్‌ టాప్ డైరెక్టర్ల‌లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌తో ఇండియ‌న్ 2, రామ్‌చ‌ర‌ణ్‌తో గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు శంక‌ర్‌ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకోవడానికి కష్టపడుతుంది.

ఇటీవల హీరో శివ కార్తికేయ‌న్ నటించిన మూవీ రన్ అనే సినిమాలో అతిథి పాత్రలో నటించింది అదితి. మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో మ‌హావీరుడు పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే అదితి తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఎంబిబిఎస్ పూర్తి చేసిన అదితి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

సినిమాల్లోకి వచ్చేందుకు తన తండ్రి శంకర్ ముందు ఒప్పుకోలేదని.. నా పేరు వాడుకోకుండా స్వయంగా నువ్వే అవకాశాల కోసం ప్రయత్నించు.. సంవత్సరం లోపు ఎలాంటి అవకాశాలు రాకపోతే నువ్వు ఇండస్ట్రీ పేరు ఎత్తడం మానేయాలని కండీష‌న్ పెట్టార‌ని వివ‌రించింది. అలా కష్టపడుతూ అవకాశాల కోసం వెతుకులాట మొద‌లు పెట్టిన అదితికి ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉందట. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు కేవ‌లం రూ.20 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక ఆమెకి డైరెక్షన్ చేసే ఆలోచన లేదని.. తండ్రి డైరెక్షన్ లో మాత్రమే నటించాలని ఉందని అదితి చెప్పుకొచ్చింది.