మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ రోజు రామ్ చరణ్ తండ్రి అవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు . రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి మహాలక్ష్మి పుట్టింది.
ఇక రామ్ చరణ్ కేరీర్ను ఒక్కసారిగా మలుపు తీపిన మూవీ మగధీర సినిమాకు కీలక పాత్ర పోషించింది రాజమౌళి. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో చరణ్ స్టేటస్ ఒక్కసారిగా మారిపోయింది. కాజల్ కూడా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో అన్ని సీన్లు డైలాగులు అదిరిపోయాయి కాజల్ కోసం రామ్ చరణ్ పందెంలో దిగుతాడు గుర్రంపై పరుగులు పెట్టి విలన్ తో పోటీపడి ఎవరు ముందుగా కోటకి చేరుకుంటారో వారికే మిత్రవింద సొంతం అవుతుంది.
ఈ పోటీలో విలన్ను ఓడించడం కోసం రామ్ చరణ్ వేగంగా గుర్రాన్ని తోలుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే గుర్రం వెనక్కి తిరిగే సమయంలో అదుపుతప్పి ఇసుకలో కూరుకుపోయే సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. అయితే ఈ సన్నివేశాన్ని దర్శకుడు రాజమౌళి చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కొండవీటి దొంగ సినిమా నుంచి ప్రేరణ పొంది తీశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సినిమాలో చిరంజీవి ఏదో ఇబ్బందుల్లో ఉంటే గుర్రం వచ్చి కాపాడుతుంది.
అయితే ఆ తర్వాత చిరు గుర్రంతో ఇంటరాక్ట్ అయ్యే సీన్ ఏమీ ఉండదు. అలా లేకపోవడంతో రాజమౌళి ఫీల్ అయ్యారట. అందుకే ఒక వ్యక్తి అయినా జంతువు అయినా సాయం చేసినప్పుడు వాటితో ఉండే ఆ అనుబంధాన్ని ప్రేక్షకులు ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో మగధీరలో ఆ సన్నివేశాన్ని పెట్టినట్టు చెప్పాడు. ఇక గుర్రం రామ్ చరణ్ ని కాపాడాక చెర్రీ ఆ గుర్రాన్ని అద్దుకొని ఎమోషనల్ అవుతాడు అందుకే ఆ సన్నివేశం అంత బాగా హైలెట్ అయింది.