దాసరి నారాయణ రావును దిగ్గజ దర్శకుడిగా నిలబెట్టిన చిత్ర రాజాల్లో చిల్లరకొట్టు చిట్టెమ్మ ఒకటి. ఈ సిని మాకు జ్యోతిచిత్రని హీరోయిన్గా పరిచయం చేశారు. అనేక విషయాల్లోఆచితూచి వ్యవహరించే దాసరి నారాయణరావు అనూహ్యంగా బొద్దుగా ఉన్న జ్యోతిచిత్రను హీరోయిన్గా పరిచయం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఇక, హీరోగా ముందు శోభన్బాబును అనుకున్నా ఆయన ఒప్పుకోలేదు.
దీంతో అనూహ్యంగా మురళీమోహన్ను దాసరి హీరోగా ఎంచుకున్నారు. ఆయనేమో సన్నగా బక్కపలచగా ఉన్నారు. హీరోయిన్ మాత్రం బొద్దుగా ఉండడంతో నిర్మాతకు అనేక సందేహాలు. అసలు ఈసినిమా ఆడు తుందా ? అనేది పెద్దడౌటు. పైగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చిల్లరకొట్టు చిట్టెమ్మకథను నాటకాలుగా బుర్రకథలుగా చెప్పుకొనేవారు.
అలాంటి అందరికీ పరిచయం అయిన కథతో సినిమా చేయడం మరో సాహసం. అయితే, భారం అంతా కూడా తానే భరిస్తానని దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పడంతో మొత్తానికి నిర్మాత అయితే.. సాహసం చేశారు. ఇక, ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ను చంపేయడం పెద్ద హైలెట్.
దీంతో మహిళా ప్రేక్షకుల ఆదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమాలో అనుకున్న విధంగా మురళీ మోహన్కు పేరు రాలేదు. అందుకే శోభన్బాబు తప్పుకొన్నారని మురళీ మోహన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.