మెగా ప్రిన్స్ వరుణ్తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినిమా సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యామిలీ సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మెగాభిమానులు ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ స్టిల్స్ చూసిన సినీ జనాలు ఈ జంట కూడా చాలా చూడముచ్చటగా.. క్యూట్గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే టాలీవుడ్ సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు వరుణ్తేజ్ పార్టీల గురించి, వరుణ్తేజ్ – లావణ్య ప్రేమాయణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు కూడా లావణ్యను కోడలిగా చేసుకోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయని తెలిపారు. లావణ్య త్రిపాఠిది యూపీలో రాయల్ ఫ్యామిలీ అని.. ఆమెకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని.. ఆమెను లవ్ చేస్తే తనకు ఎవ్వరూ అడ్డు చెప్పరన్న ఉద్దేశంతోనే వరుణ్ ఆమెను లవ్లో పడేశాడని చిట్టిబాబు చెప్పారు.
అమ్మాయి బాగుంది.. అటు ఫ్యామిలీ బాగుంది.. పైగా ఆస్తులు ఉన్నాయి.. ఇంకా వీరి ప్రేమకు ఎందుకు ఎవరు ? అడ్డు చెపుతారని కూడా చిట్టిబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం కులమతాలకు ఏ మాత్రం పట్టింపు లేదు.. అందువల్ల నాగబాబు ఎందుకు ? వీరి పెళ్లికి అడ్డు చెపుతారని కూడా చిట్టిబాబు అన్నారు.
చిట్టిబాబు వ్యాఖ్యలపై మెగాభిమానులు డిఫరెంట్గా స్పందిస్తున్నారు. నాగబాబు లేదా మెగా ఫ్యామిలీ ఆస్తులు చూసి ప్రేమలో పడరని.. పెళ్లిళ్లు చేసుకోరని.. అలాంటి వాటికి వారు దూరమని చెపుతున్నారు. ఇక చిట్టిబాబు నిహారిక గురించి కూడా మాట్లాడారు. నాకు ఆడ పిల్లలు ఉన్నారని.. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి చేసుకుని అత్తారింట్లో కాపురం చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటారని తెలిపాడు.