పెళ్లికి ముందే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కు అంత మందితో అన్నీ ఎఫైర్లు ఉన్నాయా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్క‌ర్‌ జంట ఎంతో క్యూట్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మహేష్ బాబు లైఫ్ లోకి నమ్రత ఎంటర్ అయ్యాక మనోడి కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయి. 2000 సంవత్సరంలో బిగోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు ముందుగా నమ్ర‌తని చూసి ప్రేమలో పడి ఆమెకు ప్రపోజ్ చేశాడట.

Namrata Shirodkar Photos | Latest Pictures of Namrata Shirodkar | Namrata Shirodkar: Exclusive & Viral Photo Galleries & Images | India.com PhotoGallery

ఆ తర్వాత నమ్ర‌త‌తో కూడా మహేష్ ఇష్టపడి ఒప్పుకుంది. ఐదేళ్లకు పైగా ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు న‌మ్ర‌త‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు కృష్ణ కుటుంబం ఏమాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. అప్పటికే నమ్రత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కృష్ణ మాత్రం తన కొడుక్కి అచ్చ తెలుగు సంప్రదాయ భావాలు ఉన్న అమ్మాయి భార్య‌గా రావాలని పట్టుదలతో ఉన్నారు.

సినీ రంగంలో ఉన్న తమకు సినిమా వాళ్లు భార్యలుగా వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంతో కృష్ణ నమ్రతను ముందుగా తన ఇంటి కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అయితే అప్పటికే నమ్ర‌త‌కి బాలీవుడ్లో దీపక్ శెట్టి – మహేష్ మంజ్రేక‌ర్ లాంటి వాళ్లతో ఎఫైర్‌ ఉందన్న పుకార్లు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌తోను ఆమెకు సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న పుకార్లు ఉన్నాయి.

అందులోనూ తెలుగు సంప్రదాయాలు తెలియని నార్త్ అమ్మాయి మహేష్ కు భార్యగా వస్తే మహేష్ ఫ్యామిలీ లైఫ్.. పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ అవుతుందన్న ఆందోళన కూడా కృష్ణ కుటుంబానికి ఉండేది. అయితే మహేష్ తల్లి ఇందిరా దేవితో పాటు మహేష్ సోదరి మంజుల ఇంట్లో వాళ్ళను ఒప్పించడంతో చివరకు కృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. విచిత్రం ఏంటంటే మహేష్ తో పెళ్లి తర్వాత న‌మ్ర‌త‌ ఘట్టమనేని కోడలుగా.. మహేష్ భార్యగా అచ్చ తెలుగు ఆడపడుచుగా అలా ఆ ఇంట్లో ఒదిగిపోయింది.