దర్శకధీరుడు రాజమౌళి ఏంటి కమెడియన్ వేణుమాధవ్ కి అసిస్టెంట్ ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది నిజం.. అయితే నిజ జీవితంలో మాత్రం కాదు. ఓ సినిమాలో రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా పని చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో 2004లో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విజయం సాధించింది. ఈ సినిమాలో వేణుమాధవ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు.
ఈ సినిమాలో వేణుమాధవ్ నల్లబాలు.. నల్ల తాచులెక్క నాకి చంపేస్తా అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్. ఇదే సినిమాలో రాజమౌళి వేణుమాధవ్ కి అసిస్టెంట్ గా ఓ చిన్న క్యామియో పాత్రలో మెరిశాడు. అసలు విషయం ఇది అన్నమాట. రాజమౌళి గొప్ప దర్శకుడు గానే కాకుండా మంచి నటుడు కూడా..! ఆయన తెర్కెక్కించిన ప్రతి సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో నటించి మెప్పిస్తాడు.
అలాగే ఆయనకు చిన్న చిన్న పాత్రలు చేయడానికి ఇష్టపడతారు. సై, మగధీర, ఈగ, బాహుబలితో పాటు పలు సినిమాల్లో రాజమౌళి నటించాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్తో చేయాబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అంటూ ఇప్పటికే వెల్లడించారు. రాజమౌళి గత చిత్రాలకంటే భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది.