విజయచందర్ అనేక కష్టాలు… నష్టాలు ఓర్చుకుని తీసిన సినిమా కరుణామయుడు. ఇది ఏసు ప్రభు జీవి తంలోని శిలువ వేసే పార్ట్ వరకు తీశారు. ఈ సినిమాకు అప్పట్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులనే ఎంచుకున్నారు. రాజబాబు సహా అనేక మంది ఈ సినిమాలో ఓల్డ్ ఆర్టి స్టులు పనిచేశారు. అందరూ కూడా మనసు పెట్టి చేసిన సినిమా ఇది.
అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా అయితే.. ముందుకు సాగలేదు. అనేక అవాంతరాలు వచ్చాయి. అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా డబ్బులకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. స రే.. ఏదేమైనా.. ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. తెలుగు నాట భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక, ఈ సినిమా విడుదలైన సమయంలో అన్నగారు కృష్ణావతారం సినిమాను రిలీజ్ చేశారు. ఇది అనుకున్నంత గా ఆడలేదు.
దీంతో ఏం జరిగిందని అన్నగారు ఆరా తీస్తే.. కరుణామయుడు దెబ్బతో కృష్ణుడు చతికిల పడ్డాడని తెలి సింది. ఇక, సినిమా క్రిటిక్స్ కూడా.. కరుణామయుడు సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. కృష్ణావతారం నిలబడలేక పోయిందంటూ.. కామెంట్లు కూడా చేశారు. ఈ పరిణామాలతో అన్నగారు హర్టయ్యారు. అసలు.. అంత బాగున్న సినిమానా? అంటూ.. తాను కూడా కరుణామయుడు సినిమాను చూడాలని భావించారు.
నేరుగా విజయ్చందర్కే ఫోన్ చేసి.. రామకృష్ణా సినీ స్టూడియోలోనే ఈ సినిమా వేయించుకుని చూశారు. సినిమా అయిపోయింది.. దాదాపు రెండు గంటల 45 నిమిషాల సినిమా.. అన్నగారు మధ్యలోనే వెళిపోతారని.. ఆయనకు నచ్చదని విజయచందర్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వేచి చూశారు. కానీ, సినిమా ఆశాంతం వీక్షించిన అన్నగారు… విజయ్చందర్ను మెచ్చుకోవడంతో పాటు.. కృష్ణావతారం సినిమా ను వెనక్కి తెప్పించి.. ఆధియేటర్లను కూడా… కరుణామయుడికి ఇచ్చేశారు. ఇదీ.. సంగతి!