చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో ఎందరో నటినటులు చనిపోవడంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల కూడా తీరని దుఃఖాన్ని మిగిలుస్తున్నారు. సీనియర్ నటుడు శరత్ బాబు, సంగీత దర్శకుడు రాజ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు ఎన్నో సినిమాల్లో ఘనంగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు కూడా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
తమిళ మలయాళ సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కజన్ ఖాన్ గత రాత్రి గుండుపోటుతో మరణించారు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత ప్రొడక్షన్ కంట్రోలర్ ఎస్ఎం బాద్షా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో ‘అమ్మకొడుకు’) అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయన సిని కెరీర్ లో గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి, శ్రీహరి లీడ్ రోల్ చేసిన భద్రాచలం వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. 2015లో వచ్చిన ‘లైలా ఓ లైలా’ చిత్రంలో చివరగా కనిపించారు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఇండస్ట్రీలో త్రివ విషాదాన్ని నెలకుంది.