ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అంతా మల్టీప్లెక్స్ లతో కళకళలాడుతుంది. నగరంలో ఏమూలకి వెళ్లినా మల్టీప్లెక్స్ లు కనపడుతున్నాయి. గత మూడు, నాలుగేళ్లలో కోకొల్లలుగా మల్టీఫ్లెక్స్లు పుట్టుకు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఆధునాత థియేటర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఏఎంబీ మాల్..ఇన్ ర్బిట్ మాల్ – ప్రసాద్ ఐమాక్స్ – పీవీఆర్ – సీనిమాక్స్ – నెక్ట్స్ గనేరియా అంటూ ప్రైమ్ ఏరియాలన్నింటిని మల్టీప్లెక్స్ లు కవర్ చేస్తున్నాయి.
రీసెంట్ గా అమీర్ పేట్ ఏరియా అంతా కవర్ చేసేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఏఏఏ’ మాల్ స్టార్ట్ అయ్యింది. ఇక ఏసియన్ సంస్థ తెలుగు హీరోలతో కలిసి మల్టీఫ్లెక్స్లు ప్రారంభిస్తోంది. ఇప్పటికే మహేష్తో ఏఎంబీ, బన్నీతో ఏఏఏ, విజయ్ దేవరకొండతో మహబూబ్నగర్లో ఏవీడీ మల్టీఫ్లెక్స్లు స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తమిళ హీరో శివకార్తీకేయన్తో కలిసి చెన్నైలో కూడా ఓ మల్టీఫ్లెక్స్ నిర్మించే ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్లోనే మరో టాలీవుడ్ హీరోతో కలిసి మరో మల్టీఫ్లెక్స్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. అది కూడా మరో ప్రైమ్ ఏరియాలో కావడం విశేషం. సిటీలో ఐకానికి థియేటర్ గా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం ప్లేస్లో ఇప్పుడు ఏసియన్ వాళ్లు – దగ్గుబాటి రానాతో కలిసి ఈ మల్టీఫ్లెక్స్ ప్లాన్ చేస్తున్నారట. సుదర్శన్ 70 ఎంఎం, 35 ఎంఎం రెండు థియేటర్లతో పాటు దేవి 70ఎంఎం థియేటర్ కూడా ఉంది.
ఈ రెండు థియేటర్లకు పెద్ద చరిత్రే ఉంది. అయితే ఇప్పుడు సుదర్శన్ 35 ఎంఎం ప్లేసులో ఈ మల్టీఫ్లెక్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ థియేటర్లు సిటీలో చాలా పాపులర్ గా ఉండేవి. క్రాస్ రోడ్స్ థియేటర్లన్నింటికి ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు మల్టీఫ్లెక్స్ల ఎంట్రీతో ఇవన్నీ సింగిల్ స్క్రీన్లుగా మిగిలిపోయాయి. వీటి వైభవం కనుమరుగు అవుతోంది.