అక్కినేని అఖిల్ పరువు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కాపాడేందుకు రెడీ అయ్యారు. అఖిల్ పరువు చిరంజీవి కాపాడటం ఏంటనే ఆలోచనలో పడిపోయారా ? ఇది నిజమే..! తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పెట్టుబడి ఏకంగా రు. 80 కోట్లకు చేరింది. ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రికవరీ కాలేదు.
అసలు బిజినెస్ కూడా జరగలేదు. దీంతో తక్కువ రేట్లకే రైట్స్ అమ్మేశారు. దీంతో అనిల్ సుంకర కూడా భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు న్యాయం చేయాలన్న డిమాండ్లు, ఒత్తిళ్లు నిర్మాత అనిల్ సుంకరకు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అనిల్ సుంకర మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.
ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది. ఏజెంట్ సినిమా హక్కులుకొని నష్టపోయిన బయ్యర్లకు భోళాశంకర్ హక్కులను తక్కువ రేట్లకు ఇవ్వటానికి నిర్మాత అనిల్ సుంకర సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.
భోళాశంకర్ సినిమాతో ఏజెంట్ నష్టాల నుంచి కొంతవరకు బయట పడాలని నిర్మాత అనిల్ భావిస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి సహకారం కూడా ఉండడంతో ఏజెంట్ నష్టాల నుంచి అనిల్ ఎంత వరకు గట్టెక్కుతారో ? చూడాలి.