బుక్‌మై షోలో ‘ భోళాశంక‌ర్ ‘ రికార్డ్‌… బ్రో కంటే బెట‌ర్ రా బాబు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా భోళాశంక‌ర్‌. డిజాస్ట‌ర్ సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న థియేట‌ర్ల‌లోకి రానుంది. కోలీవుడ్‌లో ఎప్పుడో ఆరేళ్ల క్రితం అజిత్ హీరోగా తెర‌కెక్కిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ భోళాశంక‌ర్ తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. ఇక మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ హంగామా షురూ చేశారు. ఈ భోళాశంక‌ర్ సినిమా ప్రస్తుతానికి డీసెంట్ బజ్ సెట్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉండగా…రిలీజ్ కి ముందే ఆన్‌లైన్ హంగామా మామూలుగా లేదు.

ఇక ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ షో బుక్ మై షో లో లేటెస్ట్ గా లక్ష ఇంట్రెస్ట్స్ రిజిస్టర్ చేసుకుంది. ఇది రీసెంట్ “బ్రో” సినిమా కన్నా చాలా బెటర్ అని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇప్పుడే ఈ సినిమాకు ఇంత బ‌జ్ ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక వసూళ్లు ఎలా ? ఉంటాయో అనేది కూడా చూడాలి మరి. భోళాశంక‌ర్‌కు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.