మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా కొత్త పరిచయాలు అక్కర్లేదు. 40 సంవత్సరాల కెరీర్ లో 150 కు పైగా సినిమాలలో నటించి కొన్ని లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లి 10 ఏళ్లపాటు గ్యాప్ తర్వాత తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రి ఇచ్చినా కూడా చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీఎంట్రీలో కూడా చిరంజీవి ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలతో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు.
ఇన్నేళ్ల తన కెరీర్లో చిరంజీవి ఎంతో మంది హీరోయిన్ల సరసన నటించారు. కొంతమంది హీరోయిన్లతో రిపీటెడ్ గా కూడా సినిమాలు చేశారు. అలా చిరంజీవి, సీనియర్ హీరోయిన్ విజయశాంతి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉండేది. చిరంజీవి – విజయశాంతి వెండితెర మీద నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా నటించేవారు. అయితే వీరిద్దరి మధ్య ఒక చిన్న కారణంతో కొన్ని సంవత్సరాల పాటు మాటలు లేవంటే నమ్మాల్సిందే. ఇది నిజం.
అప్పట్లో గ్యాంగ్ లీడర్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదన్న ప్రచారం జరిగింది. అలాగే స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ షూటింగులో కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అప్పుడు కూడా మాటలు లేవని టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవికి తనకు మధ్య మాటలు ఎందుకు లేకుండా పోయాయో అన్న విషయాన్ని విజయశాంతి తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా పరిశ్రమ నుంచి తాను కొందరిని సపోర్ట్ కోరానని.. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదని.. నాతో ఎంతో మంచి స్నేహంగా ఉండే చిరంజీవి కూడా తనకు ఎలాంటి మద్దతు ఇవ్వకపోవడంతో.. చిరంజీవితో మాట్లాడటం మానేశానని విజయశాంతి స్వయంగా చెప్పింది.
అయితే మళ్లీ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మేము ఇద్దరం కలిసాము.. అప్పటినుంచి మా ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయని విజయశాంతి చెప్పుకొచ్చారు. అలా తెలంగాణ ఉద్యమం సమయంలో చిరంజీవి నుంచి చిన్నపాటి మాట సాయం కూడా రాలేదన్న కోపంతో విజయశాంతి ఏకంగా కొన్ని యేళ్లపాటు మెగాస్టార్ తో మాట్లాడటం మానేసింది.