లాస్ట్ మినిట్ లో ఊహించని ట్వీస్ట్..చిరంజీవి – కళ్యాణ్ కృష్ణ సినిమా చెయ్యి మారిందా..?

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో రెండు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది. మరో సినిమా హిట్ డైరెక్టర్ వశిష్టత రూపొందించబోతున్నాడు. మొదట కళ్యాణ్ కృష్ణ తోనే సినిమా తీసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటించబోయే ప్రముఖ పాత్రలను ఫిక్స్ చేసేసారట.

భోలాశంకర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదల నిర్మించబోతుందంటూ మొదట్లో వార్తలు వినిపించినా ఈ ప్రాజెక్ట్ చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్టు నిర్మాతగా సుస్మిత పేరే ఉంచి తెరవెనక పెట్టుబడి మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీని చూసుకో పోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయని గుడ్ వీల్ పేరిట లాభాల్లో కొంత శాతం సుస్మితకు ఇవ్వడానికి పీపుల్ మీడియా అంగీకరించిందంటూ సమాచారం.

ఈ డీల్ నచ్చిన చిరంజీవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇక ఇప్పటివరకు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించబోతున్నారట. ఇక ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి భోళా శంకర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు..!!