టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. తొట్టెంపూడి వేణు హీరోగా, ఎలమంచిలి రవి చంద్ ప్రొడక్షన్లో తెరకెక్కిన మాయగాడు సినిమాలో ఛార్మి నటించింది. ప్రొడ్యూసర్ ఎలమంచిలి రవి చంద్ పేరు వినగానే ఈయన గతంలో పోరాడిన వివాదాలే గుర్తుకు వస్తాయి. దాసరి నారాయణరావుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఓసారి.. సినీ పైరసీ మీద పోరాడడానికి నిరాహార దీక్ష చేస్తూ ఓసారి.. ఇలా అప్పట్లో మీడియాలో తెగ వైరల్ అయ్యాడు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎలమంచిలి రవి చంద్ మాట్లాడుతూ చార్మితో మాయగాడు సినిమా టైంలో ఓ గొడవ జరిగిందని.. సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ సమయంలో ఛార్మి హాజరు కాకుండా ఇబ్బంది పెట్టేదని.. ఆ సమయంలో ఆమెతో గొడవ కూడా జరిగిందని ఫిలిం ఛాంబర్ వరకు పంచాయతీ వెళ్ళిందని.. మురళీమోహన్ గారు పిలిచి మాట్లాడి ఆమెను రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చిన కూడా ఇలా చేయడం తప్పు అని సర్ది చెప్పి పంపారని.. చివరి ప్రమోషన్ కి ఛార్మి హాజరైంది అంటూ వివరించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఎలమంచిలి మాట్లాడుతూ పైరసీ మీద నిరాహార దీక్షకు కూర్చున్న రోజు నేను ఒక్కడినే ఉన్నానని తర్వాత రోజు నుంచి ఒక్కొక్కరికి సినిమా ఇండస్ట్రీలో వారందరూ నాతో చేయి కలిపారని నాకు మద్దతుగా నిలిచారని వివరించాడు. చివరికి ప్రభుత్వం పైరసీకి పాల్పడితే తీవ్ర చర్యలు తీసుకోవడానికి ఒప్పుకుందంటూ వివరించాడు. ఆ టైంలో స్థానికంగా సీనియర్ యాక్టర్స్ జయసుధ సికింద్రాబాద్కి ఎమ్మెల్యేగా ఉందని.. జయసుధ చొరువతో ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సహాయం చేసిందంటూ వివరించాడు. ప్రస్తుతం ఎలమంచిలి రవి చంద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.