మ‌ళ్లీ ఒకే గూటికి చేరిన చైతు – స‌మంత‌… ఇదెక్క‌డి ట్విస్ట్ రా బాబు..!

దైవం ఒకటి తెలిస్తే విధి మరొకటి తలచిందా అన్నట్టుగా ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య పరిస్థితి. ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి దారిలో వారు వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా మళ్లీ ఒకే గూటి పక్షులుగా చేరిపోయారు. ప్రస్తుతం ఇదే విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది. వీరి పెళ్లి టైం లో ఎంత హంగామా నడిచిందో.. పెళ్లి తర్వాత కూడా ఎంత హడావుడి జరిగిందో చెప్పక్కర్లేదు.

స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టడంతో తెలుగు సినీ అభిమానులు అందరూ ఎంతో ఆనందపడ్డారు. చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగాక కనీసం ఐదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత నాగచైతన్యకు అస్సలు కలిసి రాలేదు. బంగార్రాజు సినిమా మాత్రమే హిట్ అయింది. అందులోనూ నాగార్జున ఉన్నాడు.

ఆ తర్వాత చైతు చేస్తున్న అన్ని సినిమాలు వరుస పెట్టి డిజాస్టర్లు అవుతున్నాయి. చెప్పుకోవటానికి ఒక హిట్టు కూడా లేదు. రీసెంట్గా చేసిన కస్టడీ కూడా బిగ్ డిజాస్టర్ అయింది. అటు సమంతకు కూడా విడాకుల తర్వాత చేస్తున్న సినిమాలు కలిసి రావటం లేదు. శాకుంతలం అయితే అతిపెద్ద డిజాస్టర్. ప్రస్తుతం సమంత ఆశలు అన్ని విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తున్న ఖుషి సినిమా మీదే ఉన్నాయి.

ఇక తాజాగా సమంత సినిమాలకు ఏడాది పాటు గుడ్ బై చెప్పనుందని ఆమె సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుందని క్లారిటీ వ‌చ్చింది. సమంత చాలా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె కమిటైన సినిమాల అడ్వాన్సులు కూడా వెనక్కు ఇచ్చేసిందని తెలుస్తోంది. నాగచైతన్య కూడా ఇటీవల కొత్త సినిమాలు కమిట్ అవటం లేదు. ఈ లెక్కన చూస్తే ఈ మాజీ భార్యాభర్తల పరిస్థితి ఇప్పుడు దాదాపు ఒకేలా ఉందని అర్థమవుతుంది. విడాకుల తర్వాత వీళ్ళ కష్టాలు ఒకేలా ఉండడంతో వీరిద్దరూ మళ్లీ కష్టాల్లో ఒకే గూటి పక్షులయ్యారన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.