మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య వృత్తిపరంగా… ఆధిపత్య పరంగాను గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోందంటూ చాలా స్టోరీలు వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే నిజం అనేట్టుగానే ఉన్నాయి. ఇక బన్నీ కూడా వాటికి బలం చేకూర్చేలా వ్యవహరించాడు. చరణ్ పుట్టినరోజును పట్టించుకోలేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా చరణ పై సరిగా స్పందించలేదు.
పైగా చరణ్ను గ్లోబల్ స్టార్ అని సంబోధించడానికి కూడా బన్నీ ఇష్టపడినట్టుగా లేదు. ఆ మాటకు వస్తే బన్నీ గత నాలుగు ఐదు సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీకి దూరం దూరంగా ఉంటూ వస్తున్నాడు. తనకంటూ సపరేట్గా అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇక వృత్తిపరంగా సినిమాలపరంగా ఎవరికి వారు తామే నెంబర్వన్ అనిపించుకోవడానికి గట్టిగా పోటీ పడుతున్నారు.
సరే ఈ కోల్డ్ వార్ ఎలా ? ఉన్నా ఇంట్లో మాత్రం ఇద్దరూ కలిసిపోయారు. తాజాగా జరిగిన ఉపాసన సీమంతం వేడుకకు అల్లు అర్జున్ అటెండ్ అయ్యాడు. తన కుటుంబంతో వచ్చి ఉపాసనను ఆశీర్వదించాడు. ఉపాసనతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది ఉప్సి అంటూ స్పందించాడు. తాజా ఫోటోతో బన్నీ – చరణ్ మధ్య అంతా ఆల్ ఈజ్ వెల్ అనే సందేశం పంపేందుకు ట్రై చేశాడు.
అయితే బన్నీకి కాంట్రవర్సీలు కొత్త కాదు.. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడిగితే చెప్పను బ్రదర్ అన్న డైలాగ్ తో చాలా రచ్చ చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ను వాటేసుకుని టోటల్ వివాదానికి పుల్స్టాప్ పెట్టేసాడు. ఇక చిరంజీవి – అల్లు అర్జున్ మధ్య కూడా పడట్లేదు అంటూ కొన్ని స్టోరీలు వచ్చాయి. అల్లు అరవింద్ కూడా తామంతా ఒక్కటే అని చెప్పినా వృత్తిపరంగా పోటీ ఉందని పరోక్షంగా ఆ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గం అన్న సంకేతాలు పంపాడు.
ఇక బన్నీ మెగా కాంపౌండ్ దాటి.. చిరంజీవి అనే మహా వృక్షం నుంచి బయటకు వచ్చి సొంతంగా అల్లు అర్జున్ ఆర్మీ అనే అభిమాన సంఘాన్ని కూడా పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా బన్నీ, చరణ్ మధ్య బయట ఎంత వార్, పోటీ ఉన్నా లోపల మాత్రం ఆప్యాయతలు, అనురాగాలతో ఉన్నాం అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.