పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మేనల్లుడు సాయి ధరమ్తేజ్ మల్టీస్టారర్ మూవీగా సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్లో హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. బ్రో సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. తేజ్పై తెరకెక్కించే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తే సినిమా పూర్తయిపోతుంది.
పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ కాంబోలో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజై ప్రేక్షకులో అంచనాలు మరింతగా పెంచేసింది. ఇక పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ రిలీజ్ కాకపోయినా టీజర్, పోస్టర్స్ తోనే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుంది.
ప్రస్తుతం బ్రో మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం అప్పుడే డిమాండ్ మొదలైపోయిందట. నైజాం రైట్స్ కోసం టాలీవుడ్కు చెందిన ఒక యంగ్ ప్రొడ్యూసర్ థియేట్రికల్ రైట్స్కి రూ. 30 కోట్లు కోట్ చేశారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ మొత్తంకి సినిమా హక్కులు ఇచ్చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఎవరు? ఆ యంగ్ ప్రొడ్యూసర్ అనేది మాత్రం బయటకు రాలేదు.
ఈ సినిమా థియేటర్ రైట్స్ కోసం ఆంధ్రలో కూడా కాంపిటీషన్ భారీగా ఉందట. ఈ సినిమాకు ముందు రిలీజైన పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్కు లాభాలు తెచ్చాయి. వకీల్సాబ్, భీమ్లానాయక్ సినిమాలకు ఏపీలో టిక్కెట్లు రేటు సరిగా ఉండి ఉంటే మరిన్ని రికార్డులతో పాటు భారీ లాభాలు వచ్చి ఉండేవి. ఇక బ్రో సినిమాకి దాదాపు రూ. 120 నుంచి రూ. 130 కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.