బాల‌య్య‌తో రొమాన్స్‌లో రెచ్చిపోయిన ఈ క‌త్తిలాంటి ఫిగ‌ర్‌ను గుర్తు ప‌ట్టారా… దేశాన్ని ఊపేసిన స్టార్ హీరోయిన్‌..!

ఈ ఫోటోలో వ‌త్తైన జుట్టుతో.. వాలు కళ్ళతో.. చిరునవ్వు చిందిస్తూ ఓర‌గా చూస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ? చూసిన వెంటనే గుర్తుపట్టడం కష్టం.. కానీ బాలీవుడ్ సినిమాలు చూసేవారు ఠ‌క్కున గుర్తు పట్టేయొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కత్తిలాంటి ఫిగర్. కింగ్ లాంటి కుర్రాడినైనా కొంగున‌ కట్టేసుకునే టాలెంట్ త‌న‌ది. ప్రస్తుతం భారతదేశంలో హైయెస్ట్ రెమ్యున‌రేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఈ బ్యూటీ కూడా ఒకటి. బ్రిటన్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ చేసింది.

త‌ర్వాత‌ ఇండియాకి వచ్చి సెటిలైపోయిన ఈ హ‌ట్‌బ్యూటి మొదట బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వరుస ప్లాపుల తరువాత కూడా ఇండస్ట్రీలో నిల‌దొకుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి స్టార్ హీరోల పక్కన అవకాశాలు ద‌క్కించుకుంది. అంచ‌లంచ‌లుగా ఎదుగుతు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి టాలీవుడ్ ప్రజలకు కూడా ఈ అమ్మాయి పరిచయమే. వెంకీ, బాల‌య్య‌ లాంటి స్టార్ హీరోలతో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ఇంతకీ ఇప్పటికైనా గుర్తుపట్టారా ? ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నామో ? ఆమె ఎవరో ? కాదు వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో నటించిన కత్రినా కైఫ్. ఆ త‌ర్వాత ఆమె బాల‌య్య‌తో అల్ల‌రి పిడుగు సినిమాలోనూ న‌టించింది. చాలాకాలం విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్న కత్రినా.. 2021 డిసెంబర్ లో విక్కీ కౌశల్ ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెద్దలను ఒపించి ఈ జంట‌ వివాహం చేసుకున్నారు ఈ జంట‌.

పెళ్లి తర్వాత కత్రినా పెద్ద‌గా సినిమాల్లో నటించలేదు. థ్రిల్లర్ కథ‌ నేపథ్యంలో ఒక సినిమాలో నటించినా అది సక్సెస్ కాలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి మేరి క్రిస్మస్ అనే సినిమాలో నటిస్తుంది కత్రినా. అలాగే తన లక్కీ హీరో సల్మాన్ తో టైగర్ 3 మూవీలో నటిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వికీ కౌశల్ తో కలిసి దిగిన ఫోటోలను తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.