అప్పుడు అమ్మ చేసిన త‌ప్పే ఇప్పుడు కూతురు జాన్వీ కూడా చేస్తోందా…!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలనాటి టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు అందరి సరస‌న‌ నటించి మెప్పించిన శ్రీదేవి కోట్లాదిమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె చనిపోయి ఇంత కాల‌మైనా ఆమెని ఎంతోమంది ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారంటే శ్రీదేవి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. దానికి ప్రధాన కారణం ఆమె నటించినా సినిమాలు. ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో వేసుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి మరణించిన తర్వాత కూతురు జాన్వీ కపూర్ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆమె తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. గ్లామర్ పరంగా ముందుకు సాగుతుందనే కానీ నటనపరంగా ఎక్కడ హిట్ ట్రాక్ రికార్డే లేదు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో శ్రీదేవి చేసిన తప్పే జాన్వి కపూర్ కూడా ఇప్పుడు చేస్తుందంటూ తెలుస్తోంది.

అప్పట్లో శ్రీదేవి ఎవరైనా స్క్రిప్ట్ చెప్తే ఆ స్క్రిప్ట్ లో తన రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాల‌ని అనుకునేదట. ఇప్పుడు జాన్వి కపూర్ కూడా అదే బాటలో వెళ్తుంది. మొదట కొర‌టాల శివ – య‌న్‌టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకు ఎన్టీఆర్ కన్నా జాన్వికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేలా స్టోరీని మార్పులు చేయాలంటూ రిక్వెస్ట్ చేసిందట. గతంలో చిరంజీవి విషయంలో శ్రీదేవి ఇలాగే చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

కాగా కొరటాల శివ మాత్రమే ఎక్కడ ఎన్టీఆర్ రేంజ్‌కు త‌గిన‌ట్టుగా ఎన్టీఆర్ రోల్‌.. జాన్వికి త‌గ్గ‌టు జాన్వి రోల్ డిజైన్ చేశారట. ఇక ఇలాంటి కండిషన్లు పెట్టే జాన్వీ ఎన్నో మంచి సినిమాల్లో అవకాశాలను కూడా మిస్ చేసుకుందట. మొత్తానికి జాన్వి కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో స్థానం సంపాదించింది. ఈ సినిమా హిట్ అయితే జాన్వి కపూర్ కు టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వస్తాయ‌నడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇలాంటి చెత్త కండిషన్లు పెడితే సినిమాల అవకాశాలు ఎలా ? వస్తాయి. ఇప్పటివరకు నీ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు.. నువ్వు అన్ని కండిషన్లు పెట్టడం అవ‌స‌ర‌మా ? అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.