నంద‌మూరి డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా..!

ప్రస్తుతం చిరంజీవి ‘ భోళా శంకర్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి ‘ భోళా శంకర్ ‘ సినిమాతో మరో హిట్ కొడతాడని చిరు ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమా తరువాత డైరెక్టర్ కుర‌సాల‌ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు చిరంజీవి ఓకే చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇదే క్రమంలో చిరంజీవి మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి సైన్ చేశాడట. గతంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాకు దర్శకత్వం వహించిన మ‌ల్లిడి వశిష్టతో చిరంజీవి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బింబిసారతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న వశిష్ట – చిరంజీవి కాంబినేషన్‌లో మూవీ అని న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా ఎలా ? ఉండబోతుందో అని ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సోషియా ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ట‌.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తార‌ట‌. కానీ ఈ సినిమాపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ వార్తల్లో ఎంత ? నిజం ఉందో కొంత కాలం వెయిట్ చేస్తే గాని తెలియదు. ఇక ‘ భోళా శంక‌ర్ ‘ సినిమా ఆగ‌స్టు 14 న ప్రేక్ష‌కుల ముందుకి రానుంది.