బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లో ముగించుకున్న ఈ షో.. ఇక ఇప్పుడు తాజాగా ఏడో సీజన్లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈసారి కొంత ఆలస్యమైనా సరే పక్క ప్లాన్ తో బిగ్ బాస్ షోను ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్వాహకులు గట్టి ప్లాన్ తోనే ఉన్నారట.
అయితే ఈ సీజన్ గత 6 సీజన్ల మాదిరిగా ఉంటుందా.. హోస్ట్ నాగార్జుననే ఉంటారా.. కొత్తగా వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అని సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు హోస్టుగా నాగార్జున స్థానంలో బాలకృష్ణను.. వివాదాస్పద వ్యక్తులను, డివోర్స్ తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్స్గా తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది.
అలా వచ్చేవారిలో అమర్ దీప్, అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, నటి ఐశ్వర్య, యూట్యూబర్ నిఖిల్, సింగర్ హేమచంద్ర, నటి మిత్రా శర్మ, డాన్సర్ శ్వేతా నాయుడు, ట్రాన్సజెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, సింగర్ మంగలి, కామన్ మాన్ కేటగిరీలో పల్లవి ప్రశాంత్, ఎంపికయ్యారట. మరి ఈ 7వ సీజన్ కూడా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..?