టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారాడు. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరూ చూసేలా తెరకెక్కించడంతో అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ సీతగా నటించింది. ఇక మారో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6400కు స్క్రీన్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ఇప్పుడు నేపాల్ లో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా మొత్తం మీద నేపాల్ జనాలకు నచ్చని ఓ డైలాగ్ ని మాత్రం తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ డైలాగ్ తీస్తేనే అక్కడ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామంటూ నేపాల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ డైలాగ్ పై నేపాల్ గవర్నమెంట్ కూడా మండిపడుతోంది.
ఇక అదుపురుష్ సినిమాలో సీతామాత భారతదేశంలో జన్మించినట్టు ఓ డైలాగ్ ఉంది. నిజానికి భారతీయ ఇతిహాసాల ప్రకారం సీతాదేవి నేపాల్లో జన్మించింది అని అంటారు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న డైలాగ్ తో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ డైలాగ్ తికుంటే సినిమాని బాయికాట్ చేస్తామంటూ వారు డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ సినిమా యూనిట్ చేసేదేమీ లేక ఆ డైలాగుని తొలగించారు.