మెగా అభిమానులకు బిగ్ బ్యాడ్ న్యూస్.. మరోసారి భారీ రాడ్ దించేసావ్ కదా మెహర్ రమేషా..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత సైరా, ఆచార్య సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరంజీవి.. ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కి చూపించాడు. ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి చిరు కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సినిమాను కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదాళం సినిమాకు రీమేగా తెలుగులో తరాకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుండగా.. చిరుకు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ న‌టిస్తుంది. అంతేకాకుండా మరో యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలు కనిపించనున్నాడు. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట కూడా ప్రేక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు ఈ సినిమా అనుకున్న రోజుకి ప్రేక్షకుల ముందుకు రాలేకపోవచ్చు అని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్.

దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకు సంబంధించి సెకండాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను అదేవిధంగా రెండు పాటల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. ఈ షూటింగ్ని ఆగస్టు మొదటి వారంలోపు కంప్లీట్ చేయటం చాలాకష్టమని.. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా విడుదల ఆగస్టులో మిస్సైతే దసరా కానుకగా మరోసారి సంక్రాంతి వార్ రిపీట్ కానుంది. ఇప్పటికే బాలయ్య నటిస్తున్న భగవత్ కేసరి కూడా దసరా కనుక ప్రేక్షకులు ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పుడు చిరు భోళాశంకర్ కూడా అదే దసరాకి వస్తే బాక్సాఫీస్ కు మరోసారి పండగే. ఇక మరి రాబోయే రోజుల్లో చిరు భోళాశంకర్ సినిమా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో చూడాలి..?