ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతిచోట వాగులు, వంకలు, చెరలు బాగా పొంగుతున్నాయి. ఈ సమయంలోనే వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తూ తల్లి కూతుర్లు వాగులో కొట్టుకుపోయారు. కుమార్తె క్షేమంగా బయటపడగా తల్లి మాత్రం వాగులో గల్లంతయింది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరి పాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళలు బృందంగా ఏర్పడి బుధవారం చాపరాలపల్లిలో వరి నాట్లు వేసేందుకు వెళ్లారు.
ఇక అక్కడ నుంచి తిరుగి వచ్చే సమయంలో గ్రామ శివారులో పాములేరు వాగు లో లెవల్ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక వారి ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో అందరూ గుంపుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో అధిక వరద దాటికి మధ్యలో ఉన్న తల్లి కూతుర్లు కుంజా సీత, కుర్సం జ్యోతి కొట్టుకుపోయారు.
ఇక ఆ వరద ఉధృతికి సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. కాసేపటికి జ్యోతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని తన ప్రాణాన్ని రక్షించుకోగా స్థానికులు కాపాడారు. ఇక తల్లి సుజాత ఆచూకీ మాత్రం రాత్రి వరకు లభించలేదు. ఇక దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
ತೆಲಂಗಾಣದ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗುಡ್ಡಂ ಜಿಲ್ಲೆಯ ಮುಲಕಪಲ್ಲಿ ಮಂಡಲ್ನ ಮಹಿಳೆಯರು ಗುಂಪಾಗಿ ಸೇತುವೆ ದಾಟುವಾಗ ಓರ್ವ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ನೀರಿನಲ್ಲಿ ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. #KannadaNews #Newsfirstlive #Telangana #kothagudem #Mulakapally #Rains #Flood pic.twitter.com/BnL3Wq54w4
— NewsFirst Kannada (@NewsFirstKan) July 27, 2023