టాలీవుడ్‌ను త‌న అందంతో క‌ట్టిప‌డేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… బ్రిట‌న్‌లో ఎంజాయ్‌..!

సింధు మీనన్ ఈ పేరు చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ చందమామ సినిమా సెకండ్ హీరోయిన్ అనగానే ఠ‌క్కున గుర్తొస్తుంది. శ్రీహ‌రి హీరోగా వ‌చ్చిన భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సింధు మీనన్ ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించింది. చందమామ సినిమాతో మొదట హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాతో తన అందంతో కట్టిపడేసిన సింధు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో భద్రాచలం , వైశాలి, రెయిన్ బో , శ్రీరామచంద్రులు లాంటి ఎన్నో హిట్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముందుగా కన్నడ పరిశ్రమలో రష్మీ అనే సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కన్నడ, తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , మలయాళ భాషల్లోను సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చందమామ సినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలను అందుకున్న సింధు మీనన్ కొంత కాలం ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపింది. తర్వాత ఆమె నటించిన సినిమాలేవి సక్సెస్ సాధించలేదు. దీంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టింది సింధు. బ్రిటన్ కి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రభుని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సింధు ఫ్యామిలీతో లైఫ్‌ ఎంజాయ్ చేస్తుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న సింధు మీనన్ ఇటీవల మళ్ళీ సినిమాలోకి రిఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి బ్రిటన్ లో సెటిలైపోయింది. సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది సింధు.