ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చేరుకుంది. నెల్లూరు జిల్లా నుంచి లోకేష్ పాదయాత్ర ఊపు మామూలుగా లేదు. ఇక సర్వేల హడావుడి కూడా మొదలైంది. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న 26 జిల్లాలలో ఒక జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలోను స్వీప్ చేస్తుందన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ జిల్లా ఏదో కాదు బాపట్ల జిల్లా. పార్టీ ఘోరంగా పడిపోయిన గత అసెంబ్లీ ఎన్నికలలోనే ఈ జిల్లాలోని నాలుగు సీట్లలో తెలుగుదేశం సంచలన విజయం సాధించింది.
ఇక బాపట్ల లోక్సభ సీటు కూడా కేవలం 15 వేల ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోయింది. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారు వన్ సైడ్ అయినట్టే కనిపిస్తోంది. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పర్చూరు నుంచి బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఏలూరి సాంబశివరావు మరోసారి హ్యాట్రిక్ గెలుపు వైపు దూసుకుపోతున్నారు. అసలు వైసిపి నుంచి సాంబశివరావుకు పోటీ ఇచ్చే నాధుడే లేడు. జగన్ ఇప్పటికే ముగ్గురు, నలుగురు అభ్యర్థులను మార్చుతున్నా ఇక్కడ పార్టీ గ్రాఫ్ సెంటిమీటర్ కూడా పెరగట్లేదు.
అటు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ కు ఎదురే లేదు. ఇప్పటికే నాలుగు సార్లు ఓటమి లేకుండా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ గత ఎన్నికలలోనే 15 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కూడా అద్దంకిలో ఆయనపై పోటీ చేసేందుకు వైసిపి అధినేత జగన్కు సరైన అభ్యర్థి దొరకని పరిస్థితి. ఇక రేపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వరుసగా మూడో గెలుపు వైపు దూసుకుపోతున్నారు. వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు ఈసారి తిరిగే లేదు. ఈసారి ఆనందబాబు గెలుపును ఎవరు ఆపే పరిస్థితి లేదు.
ఇక గత రెండు ఎన్నికలలోను స్వల్ప తేడాతో పార్టీ ఓడిపోతున్న సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ గెలుపు ఈసారి వన్ సైడ్ కానుంది. చీరాలలో గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ 18 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించింది. అక్కడ గెలిచిన కరణం బలరాం పార్టీ మారినా టిడిపి ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. ఈసారి అక్కడ టిడిపి నుంచి ఎవరు పోటీ చేసిన విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక జిల్లా కేంద్రమైన బాపట్లలో 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనుంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్న వేగేశన నరేంద్ర వర్మకు సాలుకూల పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు గత రెండు ఎన్నికల్లోను వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై సొంత పార్టీతో పాటు వైసీపీని అభిమానించే సామాజిక వర్గాలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వీటితోపాటు వర్మ ప్రజల్లోకి చొచ్చుకుపోవటం.. ఆరేడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేయటం ఈసారి వర్మకు సానుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏపీలోని 26 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే మొదటి జిల్లాగా బాపట్ల నిలుస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తుండటం విశేషం.