టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్బస్టర్ కొట్టాడు. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము లేపింది. ఇక బాక్సాఫీస్ వద్ద తన రన్ను పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లలో ఇప్పటికీ పరుగును కొనసాగిస్తూనే ఉంది.
వీరసింహారెడ్డి మొత్తం నాలుగు సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అటు ఓటీటీలో కూడా వచ్చేసింది. బుల్లితెరపై కూడా ప్రదర్శితమైంది. అయినా కూడా ఈ సినిమా ఒక థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి ఏకంగా 175 రోజులతో బాక్సాఫీస్ దగ్గర తన పరుగును పూర్తి చేసుకోవడం మరో విశేషం.
వీరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆలూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ థియేటర్లో 175 డేస్ పూర్తి చేసుకుంది. అఖండ కూడా గుంటూరు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడింది. ఇక ఇప్పుడు వీరసింహారెడ్డి కూడా బాలయ్యకు కంచుకోట అయిన రాయలసీమలోని ఆలూరులో 175 రోజులు ఆడింది.
ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమాతో దసరాకి సందడి చేయబోతున్నాడు. అలాగే తన 109వ సినిమాను కూడా మరో మెగా దర్శకుడు బాబితో చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా మరో సారి వచ్చే సంక్రింతికి ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చూస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బాలయ్య టాలీవుడ్లోనే పుల్ స్వింగ్తో దూసుకుపోతున్నాడు.