భ‌గ‌వంత్ కేస‌రి మానియా కాదు… అంతా బాల‌య్య మాయ‌…!

నందమూరి నటసింహం బాలయ్య ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోస్ వచ్చినా కూడా బాలయ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా 63 ఏళ్ల వ‌య‌స్సులోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో కుర్ర హీరోల‌కే షాకులు ఇస్తున్నాడు. అటు వెండితెర‌పై సినిమాల‌తో పాటు ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షోతో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసి ప‌డేస్తున్నాడు.

ఇక బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబో అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని అంద‌రూ ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే ఇటీవల బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో బాలయ్య గ్రేస్ జనాల్లో ఏ రేంజ్ లో ఉందో అర్థం అయిపోయింది.

భగవత్ కేసరి టీజర్ లో బాలకృష్ణ చెప్పిన ఒక్కో డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల చెవుల్లో మార్మోగుతోంది. భగవంత్ కేసరి ఈ పేరు చాన్నాళ్లు యాది ఉంటది అనే డైలాగ్ టీజర్ వచ్చినప్పటినుంచి ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది ” రాజు తను వెనకున్న వందల మందినీ చూపిస్తాడు.. మొండోడు వాడికున్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు” అంటూ కిరాక్ ఫేస్ లేపాడు. అన్న డైలాగ్ అయితే ర‌చ్చ లేపుతోంది.

ఈ సినిమా ఈ ఏడాది దసరాకు అక్టోబర్లో రిలీజ్ కానుంది. నటసింహం భగవంత్ కేసరి సినిమాలో సైలెంట్ గా ఉంటూనే బ్యాలెన్స్ చూపిస్తున్నాడు. ఈ సినిమాతో దుమ్ము లేపాలి అనేది నందమూరి ఫ్యాన్స్ కోరిక. మ‌రి ద‌స‌రాకు ఏ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ అవుతాయి… థియేట‌ర్లు షేక్ అవుతాయో ? చూడాలి.