టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ అగ్ర నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు.
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీలా కూడా బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు మరోసారి తన స్వరాలతో మోత మోగించబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు కంప్లీట్ అయింది. అలాగే దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకు రానుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే.ఇప్పటికే ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” ఊర్లో ఉన్న కుక్కలు ఊర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా..?.. గర్జిస్తుంది అడివి బిడ్డ భగవంత్ కేసరి..” అనే ఈ పవర్ ఫుల్ డైలాగును ఈ సినిమాలో బాలయ్య దగ్గర్నుంచి వస్తుంటే థియేటర్లు మొత మోగిపోవాల్సిందే.
అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరో లెవెల్ లో ఉంటుందట. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించారని కూడా తెలుస్తుంది. ఇక మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.