NBK109లో బాల‌య్య‌కు జోడీగా శ్రీదేవి.. న‌య‌న‌తార ఫిక్స్‌…!

నందమూరి నట‌సింహం బాల‌కృష్ణ‌ యంగ్ హీరోల‌కి పోటీగా ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం ‘ భగవంత్ కేసరి ‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాంతో పాటే బాబీ కాంబినేషన్‌లో మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. NBK109 టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది. ఈ సినిమా కీ రోల్స్ లో ఎవరు ? నటించాల‌నే దానిపై డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ల‌ను ఫిక్స్ చేసేసారని గుస‌గుస‌లు ఇండస్ట్రీలో న‌డుస్తున్నాయి. బాల‌య్య సినిమాలో హీరోయిన్‌లు అనగానే ఇద్దరు హీరోయిన్స్ ఉంటార‌ని మ‌నం ఫిక్స్ అయిపోతాం. మొదటి హీరోయిన్‌గా నయనతారను సెలెక్ట్ చేశారని.. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. ఇప్పటికే నయనతార – బాలకృష్ణతో కలిసి మూడు సినిమాలలో నటించింది.

ఈ మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న బాలయ్య – నయనతార ఈ సినిమాలో మరోసారి కలిసి నటించబోతున్నారు. రెండో హీరోయిన్‌గా ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారట. వారిలో ఎవరు ? నటిస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. రకుల్ ప్రీత్ సింగ్, సంయుక్త మీనన్ వీరిద్దరిలో ఎవరో ఒకరు రెండో హీరోయిన్గా నటించబోతున్నారట.

ఇప్పటికే రకుల్ ‘ ఎన్టీఆర్ కథానాయకుడు ‘ సినిమాలో శ్రీదేవి పాత్రలో బాలకృష్ణ సరసన‌ నటించింది. ఆ సినిమాలో ర‌కుల్ అచ్చుగుద్దిన‌ట్టుగా శ్రీదేవిగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో కూడా రకుల్ నటిస్తే బాలకృష్ణ – రకుల్ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా అవుతుంది. రకుల్ ప్రస్తుతం టాలీవుడ్‌కి దూరంగా ఉంటోంది.

ఇక సంయుక్త మీన‌న్ యంగ్ హీరోల సరసన మాత్ర‌మే నటించడంతో సీనియర్ హీరో బాలకృష్ణ సరసన నటిస్తుందో..? లేదో..? తెలీదు. వీరిద్దరిలో ఎవరు బాల‌య్య‌కు జోడీగా ఫిక్స్ అవుతార‌నే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి హీరోయిన్ నయనతార అనే విషయం క్లారిటీ వ‌చ్చేసింది.