సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకేరోజు రెండు, మూడు సినిమాలు విడుదలవడం సర్వసాధారణం. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రెండు మూడు విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా సెలవు రోజుల్లో ముఖ్యమైన పండగల సీజన్లో వస్తూ ఉంటాయి. మన తెలుగులో అయితే సంక్రాంతి సీజన్లో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలని ఆశ పడుతుంటారు.
ఇలా సంక్రాంతికి ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు పోటీపడుతూ ప్రేక్షకులు ముందుకు రావడం ఆనవాయితీ. ఎన్టీఆర్, కృష్ణ నటించిన దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం వంటి సినిమాలు కూడా ఒకేసారి ఒకరోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలయ్య, చిరు ఎన్నో సార్లు సంక్రాంతికి తమ సినిమాలతో పోటీ పడి రక్తికట్టించారు.
విచిత్రం ఏంటంటే ఒకే కథతో.. ఒకే నేపథ్యంతో తెరకెక్కి.. ఒకే రోజు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బరిలో పోటీపడిన హీరోలలో వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు కూడా ఉన్నాయి. ఇద్దరు హీరోలు ఒకే రకమైన సినిమా చేయడమే కాకుండా ఒకేరోజు ఆ సినిమాలను విడుదల చేశారు. బాలకృష్ణ అశోక్ చక్రవర్తిగా రాగా, వెంకటేష్ ధృవ నక్షత్రం సినిమాతో వచ్చాడు. బాలకృష్ణ నటించిన అశోక్ చక్రవర్తి సినిమా మలయాళం లో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు.
ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్ ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 1989 జూన్ 29న విడుదలయింది. మరోవైపు వెంకటేష్ హీరోగా వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం సినిమా కూడా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్గా తెరకెక్కింది. ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ఆర్యన్ సినిమాకు ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు.
ఈ సినిమా కూడా 1989 జూన్ 29నే విడుదలయింది. అయితే ఈ రెండు సినిమాలలో బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్గా నిలిచింది. వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.