మన తెలుగు చిత్ర పరిశ్రమకు నటరత్న ఎన్టీఆర్- అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు.. ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాలతో తెలుగు వారికి చిత్ర పరిశ్రమకు భారీ క్రేజ్ తీసుకువచ్చారు. అప్పట్లో ఇద్దనరి హీరోల సినిమాల పరంగా ఎంతో గట్టి పోటీ కనబడేది. బయట మాత్రం వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉండేవారు. అదే విధంగా ఎన్టీఆర్- నాగేశ్వరావు కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇప్పుడు ఈ విషయం పక్కన పడితేే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు.
అలాగే ఇప్పటి తరం హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్- ఏఎన్ఆర్ గతంలో కలిసి గుండమ్మ కథ సినిమాలో అన్నదమ్ముల నటించారు. ఇప్పుడు వారి కొడుకులైన బాలకృష్ణ- నాగార్జున కూడా గుండమ్మ కథ సినిమాని మరోసారి రీమేక్ చేయాలని భావించారట. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం నటీనటులను మాత్రమే మార్చి ఆ సినిమా తీయాలని గతంలో భావించారట. ఇదే విషయాన్ని బాలకృష్ణ- నాగార్జున కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.
అదే సమయంలో గుండమ్మ కథ సినిమా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పాత్ర సూర్యకాంతం. ఆ పాత్ర సినిమాకి ఎంతో హైలెట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు తీసే సినిమాలు సూర్యకాంతం పాత్ర చేయడానికి బాలకృష్ణ- నాగార్జున చాలామంది ఆర్టిస్టులను వెతికారట కానీ ఏ ఒక్కరు కూడా సూర్యకాంతం పాత్రలో కనీసం రెండు శాతం కూడా చేయలేకపోయారట. ఇక సూర్యకాంతం పాత్రకు ఎవరు దొరకపోవడంతో ఆ సినిమాను అక్కడితో ఆపేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ సినిమాని ఎవరు రీమేక్ చేయాలని చూసినా గుండమ్మ పాత్ర దొరకపోవడంతో ఇప్పటికీ ఆ సినిమా రీమేక్ కోరిక బాలకృష్ణ- నాగార్జునకు తీరకుండానే మిగిలిపోయింది. మరి రాబోయే రోజులైనా ఈ కోరిక తీరుతుందో లేదో చూడాలి.