విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వీరాజ అశ్విన్, వైష్ణవి చైతన్య కీరోల్స్ ప్లే చేస్తున్న సినిమా బేబి. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఈనెల 14న రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మూవీ టీం. ఈ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
వేదిక పైన కంటతడి పెట్టుకుంది. వైష్ణవి మాట్లాడుతూ యూట్యూబ్ లో చిన్న చిన్న వెబ్ సిరీస్ లో నటిస్తూ.. వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఉండేదాన్ని అని.. అలాంటిది దర్శకుడు రాజేష్ నాకు బేబీ సినిమాలో అవకాశం ఇచ్చారని ఎమోషనల్ అయ్యింది. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు.. కీ రోల్లో నటించగలనా ? అనే భయం నాకు ఉండేదని.. ఆ టైంలో నాకు ధైర్యం చెప్పి నన్ను ఈ సినిమాలో హీరోయిన్గా చేశారని వైష్ణవి చెప్పింది.
డైరెక్టర్ రాజేష్ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చింది. యూట్యూబ్ లో వీడియోలు చేసేటప్పుడు మెయిన్ లీడ్ గా చేయాలనేది నా లక్ష్యం అని చెప్పింది. ఆ తర్వాత సహాయనిటిగా కూడా చేయాల్సి వచ్చిందని.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో తాను హీరోయిన్గా మెయిన్ లీడ్ లో చేయలేనని చాలామంది నానా మాటలు అన్నట్టు ఆమె తెలిపింది.
అయితే బేబీ సినిమాలో డైరెక్టర్ రాజేష్ గారు మంచి ఛాన్స్ ఇచ్చారని ఎమోషనల్ అయింది.ఈ విషయంలో నాకు ఆయన మరో జన్మనిచ్చారు.. ఆయన వల్లే ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా అని వివరించింది. ఆయనతో పాటే నిర్మాత ఎస్ కే ఎస్ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారని కంటతడి పెట్టుకుంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.