ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-AI శాసించే రోజులు వచ్చేస్తున్నాయి. AIతో ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నా.. అదే టైంలో దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం కూడా నడుస్తుండడంతో ప్రపంచమే దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటోంది.
ఇక ఆన్ లైన్ మోసగాళ్లు, అందుబాటులోకి వచ్చిన ఈ AI టెక్నాలజీని వాడేస్తున్నారు. తాజాగా AI దెబ్బతో జరిగిన మోసాల గురించి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ మోసమే పెద్ద ఉదాహరణ కాబోతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఓ వీడియో కాల్ వచ్చింది. అతడు ఆ కాల్ ఆన్సర్ చేశాడు. అటు వైపు నుంచి తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నారు.
తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని.. డబ్బులు పంపించమని ప్రాధేయపడ్డాడు. దీంతో సదరు వ్యక్తి డబ్బులు పంపించాడు. అయితే ఆ వీడియో కాల్లో మాట్లాడిన వ్యక్తి అందరూ అనుకున్నట్టు ఇటు డబ్బులు పంపిన వ్యక్తికి తెలిసిన వ్యక్తి కాదు. AI టెక్నాలజీ వాడుకుని తెలిసిన వ్యక్తి ఫేస్ తీసుకుని కాల్ చేశాడు. పైగా ఈ వీడియో కాల్లో ఇటు తెలిసిన నెంబరే కావడంతో అనుమానించడానికి ఆస్కారం తక్కువ.
ఇలా సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసంలో వీడియో కాల్లో తెలిసిన వ్యక్తి ముఖం కనిపించడం మాత్రమే కాదు.. అతడి ఫోన్ నెంబర్ కూడా వాడుకుని మరీ మోసం చేస్తున్నారు. ఇదో పెద్ద మోసం జరిగే లోగానే జరిగే నష్టం జరిగిపోతోంది. ఇక కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియా నుంచి డీపీలు తీసుకుని వాటితో AI వీడియోలు తయారు చేసి మోసం చేశారు.
ఏదేమైనా ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇప్పుడు ఇదో సరికొత్త మోసంగా మారిపోనుంది. ఏదేమైనా AI టెక్నాలజీ విషయంలో ఎలాంటి సందహాలు ఉన్నా సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాలని సూచిస్తున్నారు.