మనిషికి జీవితంలో డబ్బు ఉన్న లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కావాల్సినంత డబ్బును సంపాదించుకోవచ్చు.. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ? మాట్లాడుకుంటున్నామంటే.. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన సినీ తారలు ప్రస్తుతం ఆరోగ్యం సరిలేక వీల్ చైర్ పై బాధపడుతున్నారు. అలా ఉన్న సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం.
మన తెలుగు చత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటులలో సీనియర్ నటుడు నూతన ప్రసాద్ కూడా ఒకరు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా నూతన ప్రసాద్ రెండు కాళ్లు కోల్పోయాడు. ఆయన చాలా కాలం పాటు వీల్ చైర్ పైనే ఉన్నారు. అలా కొన్ని సినిమాల్లో కూడా అలాగే నటించారు. వీరి జీవితాలు చూస్తే నిజంగానే కన్నీళ్లు ఆగవు.
చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నానటి అను అగర్వాల్.. హీరోయిన్గా అను అగర్వాల్ కుర్రాళ్ళ మనసు గెలుచుకుంది. అదే సమయంలో అను అగర్వాల్ ముఖ్యపాత్రలో వచ్చిన ఆషికీ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ కూడా తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత అను అగర్వాల్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత 20 రోజులు పాటు కోమాలోనే ఉండిపోయింది.
ఆ తర్వాత కోమా నుంచి బయటికి వచ్చినప్పటికీ ఆమె శరీరంలో చాలా చోట్ల రాడ్లు వేశారు. కానీ అను అగర్వాల్ ప్రస్తుతం వాటన్నిటిని భరించి తట్టుకొని ఎంతో ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటూ వెయిట్ లిఫ్టర్ గాా కొనసాగుతుంది. మరో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ కూడా ప్రస్తుతం సినిమాలకు దూరంగా పక్షవాతం కారణంగా వీల్ చేరికే పరిమితమయ్యారు. ఇలా వీరే కాకుండా ఎందరో నటీనటులు ఇలా వీల్ చేరికే పరిమితమైన వారు ఉన్నారు