చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే పలువురు అగ్ర సెలబ్రిటీలు వివిధ కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అగ్ర సెలబ్రిటీలు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నిండిపోయింది. రీసెంట్ గానే బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ విషయం మరవకముందే మరో నటుడు మరణించాడు. తాజాగా ఓ సీనియర్ నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన మోహన్ మృతి చెందాడు. ఆయన మృతదేహం అనాధ శవంలా రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడి స్థానికులు. ఇక దాంతో పోలీసులు ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టాన్ ను నిర్వహించారు. దాంతో ఆ మృతదేహం నటుడు మోహన్ ది అని తేలింది.
ఇక కమలహాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమాలో నటించడు మోహన్. ఆ సినిమాలో ఆయన మరుగుజ్జు స్నేహితుడిగా కనిపించాడు మోహన్.ఆ సినిమాతో పాటు నాన్ కడవుల్, అదిశయ మనిదర్గళ్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించాడు మోహన్. మోహన్ సొంత ఊరు సేలం జిల్లా మేటూర్.. అయితే ఆయన సేలం నుంచి మధురై ఎందుకు వెళ్ళాడు అక్కడ ఎలా చనిపోయాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మోహన్ మరణ వార్త తెలియడంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అయితే గత్త కొంతకాలంగా మోహన్ కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావడంతో సినిమాల్లో అవకాశాల కోసం మధురై వచ్చాడని ఇక్కడ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో… మధురై రోడ్లపై భిక్షాటన చేసుకున్నాడని పేదరికం కారణంగా అనారోగ్యంతో అతడు మరణించి ఉంటాడని పలువురు అంటున్నారు. ఇక మోహన్ మరణంతో పలువురు సంతాపం కూడా తెలిపారు.