కొంప ముంచేసిన అనుష్క కొత్త నిర్ణయం.. ప్రభాస్ అభిమానులు తట్టుకోగలరా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిశ్శబ్దం తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని. తన లుక్స్ విషయంలో వచ్చిన తేడాను సరి చేసుకుని మళ్లీ హాట్ ఫోటోషూట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అనుష్క యువ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకురానుంది.ఈ సినిమా తర్వాత అనుష్క మరో ఏ సినిమా కమిట్ అవలేదు.

ఇప్పుడు ఇదే సమయంలో అనుష్క ఎవరితో చేసినా సరే ప్రభాస్ తో నటిస్తే మాత్రం ఆ లెక్క మరో లెవెల్ లో ఉంటుంది. ఇక బాహుబలి సినిమాల తర్వాత అనుష్క- ప్రభాస్ మళ్లీ కలిసి కనిపించే ఛాన్స్ ఎక్కడ దొరకలేదు. ఫ్యూచర్లో కూడా ఈ ఇద్దరూ కలిసి నటించే ఛాన్స్ లేదా అంటే ఇప్పుడప్పుడే అది జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిపోయాడు. వరుస భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు.

అనుష్క తో క‌లిసి న‌టించిన స‌రే ఆ సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ అనుష్క ఇప్పుడున్న లుక్స్ పరంగా పాన్ ఇండియా సినిమాలు చేయడం చాల కష్టం. అందుకే వీరిద్దరు క‌లిసి చేయాలంటే ఒక మంచి స్క్రిప్ట్ రావ‌లి. ప్రభాస్- అనుష్క కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ మ‌రోలా ఉంటుందని చెప్పొచ్చు. అనుష్క కమర్షియల్ సినిమాలను వదిలి కేవలం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని అనుకుంటుందని తెలుస్తుంది. ఇక మ‌రీ రాబోయో రోజులో అయ‌న ఇద్ద‌రు క‌లిసి సినిమాలు చేస్తార లేదా అనేది చూడాలి.