అక్కినేని నాగేశ్వరరావు అగ్రహీరోగా మారిన తర్వాత.. రెండు చేతలా సంపాయించుకున్నారు. ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ. రైతు కుటుంబం నుంచి రావడంతో ప్రతిరూపాయినీ ఆయన చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. దీంతో అన్నగారు ఎన్టీఆర్ సూచనల మేరకు… ఆయన అన్నపూర్ణ సినీ స్టూడియో నిర్మిం చారు. అయితే.. అప్పటికి ఇంకా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు రాలేదు. దీంతో తొలినాళ్లలో స్టూడియోలో ఆయన సొంత సినిమాలు తీసుకునేవారు
అవి లేకపోతే.. ఇక, స్టూడియోకు తాళమే. దీంతో ఏదోఒక సినిమా ఎప్పుడూ చేయాలని నిర్ణయించుకుని అక్కినేని అదే పనిచేశారు. కానీ, ఎన్నాళ్లని సొంత సినిమాలు చేస్తాం అనుకుని దాదాపు కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్కు ఇండస్ట్రీ వచ్చినా.. అప్పటికి హీరో కృష్ణ పద్మాలయా సినిమా స్టూడియోను నిర్మించుకున్నారు. ఇక, రామానాయుడు కూడా మరో స్టూడియో నిర్మాణం చేసుకున్నారు.
దీంతో అంతో ఇంతో పుంజుకుంటున్న సమయంలో ఈ రెండు కూడా అధునాతన సౌకర్యాలతో పోటీ ఇచ్చాయి. అదేవిధంగా అన్నగారు కూడా రామకృష్ణా సినీ స్టూడియోస్ పేరుతో ఆయన కూడా సొంతగా స్టూడియో నిర్మించుకున్నారు. ఇక, విసిగిపోయిన అక్కినేని దీని బాధ్యతలను ఆయన కుమారుడు, హీరో నాగార్జునకు ఇచ్చారు.
దీంతో అప్పటికే ఇబ్బందుల్లోనూ లాస్లోనూ ఉన్న స్టూడియోను గాడిలో పెట్టేందుకు.. నాగార్జున చాలానే కృషి చేశారు. ఇక్కడే సినిమాల్లో నటించేవారికి శిక్షణ ఇప్పించారు. అదేసమయంలో అద్దెకు ఇవ్వడంలో ఉన్న నిబంధనలను కూడా సడలించారు. తర్వాత టీవీల చానెళ్లు పెరిగాక.. వాటికి లీజు పద్దతిలో ఇచ్చారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో లాభాల బాటపట్టింది.